- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Nepal bus accident: నేపాల్ బస్సు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు మృతి
నేపాల్: నేపాల్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు భారతీయ యాత్రికులు సహా ఏడుగురు మరణించారు. రాజస్థాన్ నుంచి యాత్రికులను తీసుకెళ్తుండగా.. మాధేష్ ప్రావిన్స్లోని బారా జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సిమారా సబ్-మెట్రోపాలిటన్ సిటీ వద్ద చురియమై ఆలయానికి దక్షిణంగా నది ఒడ్డున అదుపుతప్పిన బస్సు, రోడ్డుపై 50 మీటర్ల దూరంలో పడిపోయినట్లు ఖాట్మండు పోస్ట్ వార్తాపత్రిక నివేదించింది.
ఈ బస్సులో మొత్తం 26 మంది ప్రయాణిస్తుండగా.. ప్రమాదంలో ఆరుగురు భారతీయులు, ఒక నేపాల్ పౌరుడు మృతి చెందాడు. మరో 19 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబానికి సమాచారం అందించామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ బహదూర్ ఛెత్రి తెలిపారు. ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ జిలామీ ఖాన్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు బారా జిల్లా పోలీస్ కార్యాలయ చీఫ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోబీంద్ర బోగటి తెలిపారు.