MP Chamala : మాకు కొలువులు వచ్చే వరకు ఏ నియామకాలు జరుగొద్దు! కేటీఆర్‌పై ఎంపీ చామల సెటైర్లు

by Ramesh N |
MP Chamala : మాకు కొలువులు వచ్చే వరకు ఏ నియామకాలు జరుగొద్దు! కేటీఆర్‌పై ఎంపీ చామల సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ అశోక్‌నగర్‌‌లో బుధవారం అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసిన విషయం తెలిసిందే. అకోశ్‌నగర్ దద్దరిల్లిందని బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంపై ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు వారికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థులను కలవనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.

‘దద్దరిల్లిపోవాలి అంతే.. అస్సలు ఎగ్జామ్స్ పెట్టుడేంటి? వాయిదాలు లేకుండా కేసులు లేకుండా.. లీకులు లేకుండా.. మాకే కోలువులు పోయినాయి, ఇప్పుడు కోలువుల అవసరం ఏంటి? బరాబర్ వాయిదా వేయాల్సిందే మాకు కోలువులు వచ్చే వరకు ఏ కొలువులు జరుగకుండా చూసే బాధ్యత మాది.. ఉద్యమం చేస్తాం.. అంతేనా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ’ అంటూ కేటీఆర్‌కు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.

Advertisement

Next Story