మహిళలను ఇసుక తిన్నెల్లో రేప్ చేసి.. కిరాతకంగా చంపిన..

by Anukaran |
మహిళలను ఇసుక తిన్నెల్లో రేప్ చేసి.. కిరాతకంగా చంపిన..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ హత్య కోసం కూపీ లాగితే.. మరో నాలుగు హత్యలు వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు మహిళలకు మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేశాడని రుజువు కావటంతో కోర్టు ఓ వ్యక్తికి జీవిత ఖైదుని విధించింది. వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం కేదారిలంకకు చెందిన లక్ష్మీనారాయణ దుర్గమ్మ కథలు చెబుతుండేవాడు.

ఈ క్రమంలోనే అమాయక మహిళలను మభ్యపెట్టి.. ధవళేశ్వరం బ్యారేజి దిగువన పిచ్చుకలంక ఇసుక తిన్నెలు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. అంతేకాకుండా వారిని చంపి నగలతో పారిపోయేవాడు. ఇదే విధంగా.. 2017లో భాగ్యవతి అనే మహిళను మామిడికుదురులో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకని దర్యాప్తు చేయగా.. నిందితుడు ఐదుగురు మహిళలు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినట్టు తేలింది. దీంతో లక్ష్మీనారాయణను పట్టుకుని అరెస్ట్‌ చేయగా.. 2019లో విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకొస్తుండగా తప్పించుకున్నాడు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని అమలాపురం కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.

Advertisement

Next Story

Most Viewed