బీజేపీ గెలిస్తే ఆ వర్గానికే సీఎం పోస్ట్.. కేంద్రమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన

by Satheesh |
బీజేపీ గెలిస్తే ఆ వర్గానికే సీఎం పోస్ట్.. కేంద్రమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం కుటుంబ రాజకీయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేటలో బీజేపీ తలపెట్టిన జనగర్జన సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కేటీఆర్‌ను సీఎం చేయడం కేసీఆర్ లక్ష్యం.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం సోనియా గాంధీ లక్ష్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ, గరీబ్ కల్యాణ్ అనేది బీజేపీ లక్ష్యమని అన్నారు. ఈ రెండు పార్టీలు కుటుంబ కోసం పని చేసే పార్టీలని మండిపడ్డారు. బీఆర్ఎస్ పేదలు, బీసీల వ్యతిరేక పార్టీ అని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.

Advertisement

Next Story

Most Viewed