CM Revanth Reddy: హైదరాబాద్‌కు ‘ట్రైజిన్ ఏఐ’ సెంటర్.. కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట

by Prasad Jukanti |
CM Revanth Reddy: హైదరాబాద్‌కు ‘ట్రైజిన్ ఏఐ’ సెంటర్.. కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇవాళ న్యూయార్క్‌లో ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ట్రైజిన్ టెక్నాలజీస్ సుముఖత వ్యక్తం చేసింది. ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఈ సంస్థ తెలిపింది. మూడేళ్లలో వెయ్యికిపైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ట్రైజిన్ టెక్నాలజీస్ ప్రతినిధులు సీఎం టీమ్‌కు వివరించారు.

Next Story

Most Viewed