TGPSC సంచలన నిర్ణయం..ఆ పరీక్ష సమయంలో మార్పులు

by Jakkula Mamatha |
TGPSC సంచలన నిర్ణయం..ఆ పరీక్ష సమయంలో మార్పులు
X

దిశ,వెబ్‌డెస్క్:గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలోని 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. జులై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో TGPSC మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇది వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30వరకు అని వెబ్ నోట్ ఇచ్చామని, దాన్ని తాజాగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటలకు మార్చినట్లు వెల్లడించింది. అక్టోబరు 21 నుంచి అక్టోబర్ 27 వరకు హైదరాబాద్ నగరంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

Next Story

Most Viewed