Breking: నాంపల్లిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు.. భక్తుల ఆగ్రహం

by Prasad Jukanti |
Breking:  నాంపల్లిలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు.. భక్తుల ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవీ నవరాత్రి ఉత్సవాల వేళ దారుణం చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమ్మవారి విగ్రహాన్ని నిర్వాకులు ప్రతిష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అమ్మవారిని ప్రతిష్టించి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత గురువారం రాత్రి దాండియా కార్యక్రమం సైతం నిర్వహించారు. అయితే అర్ధరాత్రి తర్వాత అక్కడ విద్యుత్ సరఫరా బంద్ చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు అమ్మవారి చేతి విగ్రహాన్ని విరగొట్టారు. అమ్మవారికి అలంకరించిన వస్త్రాలను తొలగించి చిందరవందరగా విసిరేశారు. ఈ విషయాన్ని ఇవాళ ఉదయం గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story