ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: తల్లోజు ఆచారి

by Kalyani |
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: తల్లోజు ఆచారి
X

దిశ, ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. ఆదివారం ఆమనగల్ పట్టణ కేంద్రంలో మండలం, మున్సిపాలిటీ అధ్యక్షుడు లక్ష్మణరావు, రాంపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 30 వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు జన సంపర్క్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

బిఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధిపై నిర్లక్ష్యం చేస్తూ పబ్బం గడుపుతున్న వారిని నిలదీస్తూ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు హరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు శ్రీను, అసెంబ్లీ కో కన్వీనర్న నరసింహ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దుర్గయ్య, నాయకులు వెంకటయ్య, శ్రీకాంత్, కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, లక్ష్మణ్ విజయ్ కృష్ణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed