దర్గా వద్ద ఘర్షణ.. ఇరు వర్గాల వారికి గాయాలు

by Nagam Mallesh |
దర్గా వద్ద ఘర్షణ.. ఇరు వర్గాల వారికి గాయాలు
X

దిశ, కొత్తూరుః రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డ ఘటన మండల కేంద్రంలోని జేపీ దర్గాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి సమయంలో సయ్యద్ రఫీక్, ఫయాజ్ మునావర్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాల వారికి గాయాలు జరిగాయని తెలిపారు. సయ్యద్ రఫీక్ కు చెందిన 9 మంది సబ్ కాంట్రాక్టర్లు ప్రధాన కాంట్రాక్టర్ ఖాజాపాషా దగ్గర దర్గా మెయింటెనెన్స్ కు సంబంధించి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని పనులు నిర్వహిస్తున్నారు. ఫయాజ్ మునవర్ అనే వ్యక్తి తన వర్గం వారికి నెలకు రూ.5 లక్షల మామూలు ఇవ్వాలని, ఇవ్వకపోతే దర్గా మెయిన్టెనెన్స్ పనులు జరుపుకోనియమని వారిని బెదిరిస్తూ గత కొంతకాలంగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దర్గాలోని బొమ్మల షాప్ దగ్గర ఫయాజ్ బ్యాచ్ కట్టెలతో దాడి చేసాడని రఫిక్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఫయాజ్ మామ శౌకత్, నవాజ్ తదితరులకు శుక్రవారం రాత్రి జరిగిన గొడవ గురించి సయ్యద్ రఫీక్ వాళ్ళని అడగడానికి వెళ్లగా పాత కక్షలు మనసులో పెట్టుకొని కొట్టారని ఫయాజ్ వర్గం కూడా ఫిర్యాదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed