నార్కెట్ పల్లి రహదారిపై ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం!

by Geesa Chandu |
నార్కెట్ పల్లి రహదారిపై ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం!
X

దిశ, మాడుగులపల్లి: నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి.చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించాయి.మంటలు గమనించి కారులో ఉన్న ప్రయాణికుడుని స్థానికులు అద్దాలు పగల కొట్టి బయటికి తీశారు.గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ప్రయాణికున్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed