Tirumala Samacharam: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్

by Shiva |
Tirumala Samacharam: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తులు కిక్కిరిసిపోయారు. గురువారం శ్రీవారి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex) లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులతో నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌజ్ (Krishnateja Guest House)వరకు క్యూ కొనసాగుతోంది. గురువారం స్వామి వారిని 68,835 మంది భక్తులు దర్శించుకోగా, అందులో 25,883 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.96 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed