Raja singh: చదువు పేరుతో వాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతుండ్రు: రాజాసింగ్ హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-08-27 15:41:59.0  )
Raja singh: చదువు పేరుతో వాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతుండ్రు: రాజాసింగ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చెరువు, కుంటలు, బఫర్‌ జోన్లు, ప్రభుత్వ ఆస్తులే పరిరక్షణగా నెలకొల్పబడిన ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను యుద్ధ ప్రాతిపదికన కూల్చివేస్తూ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒవైసీ బ్రదర్స్‌ను ఉద్దేశించి సంచలన వాఖ్యలు చేశారు. నగర పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో 30 ఎకరాల చెరువులో ఒవైసీ సోదరులు మొత్తం 12 ఎకరాలను ఆక్రమించారని ఆరోపించారు. ఎడ్యుకేషన్ పేరుతో ఒవైసీ బ్రదర్స్ అసదుద్దీన్, అక్బరుద్దీన్ కోట్లు కొల్లగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆనాడు బీఆర్‌ఎస్ మద్దతు చూసుకునే చెరువును కబ్జా చేసి కాలేజీలు నిర్మించారని ధ్వజమెత్తారు. అదేవిధంగా నేడు చెరువుల పరిరక్షణకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న పనికి ఆయన అభినందనలు తెలిపారు. కానీ, రేవంత్‌ను కూడా ఆ అన్నదమ్ములు ఇద్దరూ భయపెట్టాలని చూస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

కావాలంటే బుల్లెట్ల వర్షం కురపించండి..

కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. కానీ ఆ స్కూల్‌ను మాత్రం కూల్చొద్దంటూ ఎంఐఎం శాసససభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కళాశాలను ‘హైడ్రా’ కూల్చివేయబోతోందని వస్తున్న వార్తలపై తొలిసారిగా ఇవాళ ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టి పెట్టుకుని బండ్లగూడలో ఫాతిమా ఓవైసీ పేరున 12 భవనాలతో కళాశాలను నిర్మించానని తెలిపారు. ఇప్పుడు వాటిని కావాలనే కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలోనే తనపై కాల్పులు జరగాయని, కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండని ఎమోషనల్ అయ్యారు. కత్తులతో దాడి చేయండి.. కానీ నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతోన్న విద్యా సంస్థకు అడ్డుపడొద్దని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed