PM MODI: కరీంనగర్ దసరా లక్కీ డ్రాలో ప్రధాని మోడీ జాక్ పాట్!

by Prasad Jukanti |
PM MODI: కరీంనగర్  దసరా లక్కీ డ్రాలో ప్రధాని మోడీ  జాక్ పాట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దసరా సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో ప్రధాని నరేంద్ర మోడీ జాక్ పాట్ కొట్టారు. బహుమతిని గెలుచుకుని ఆశ్చర్యపరిచారు. మీరు చదివినది నిజమే. కానీ ఈ లక్కీ డ్రాలో విజయం సాధించింది స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కాదు. అదృష్టం వరించాలని ఓవ్యక్తి తన అభిమాన నాయకుడు ప్రధాని మోడీ పేరుతో టికెట్ తీసుకోగా ఆ టికెట్ విజయం సాధించింది. కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ శక్తి యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో మొదటి బహుమతిగా కూలర్, రెండవ బహుమతిగా మిక్సర్, మూడవ బహుమతిగా గ్యాస్ స్టవ్ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఈ లక్కీ డ్రాలో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో కొనుగోలు చేసిన టికెట్ కు అదృష్టం వరించింది. ఈ లక్కీ డ్రాలో రెండవ బహుమతి దక్కించుకుంది. దీంతో టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తికి నిర్వాహకులు మిక్సీని అందజేశారు. కాగా మోడీ పేరుతో ఉన్న ఈ టికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story