ఈ నెల 28న హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

by Mahesh |
ఈ నెల 28న హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించి సంచలనంగా మారింది. అయితే ఈ ఎన్నికల అనంతరం జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణ వైపు వచ్చింది లేదు. దేశ వ్యాప్తంగా బీజేపీ మెంబర్ షిప్ కార్యక్రమం ఉవ్వెత్తున కొనసాగుతుంది. ఈ క్రమంలో నెల 28న హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు తెలుస్తోంది. జేపీ నడ్డా సికింద్రాబాద్‌లో మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో భేటీ కానున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్నారు. అనంతరం గోషామహల్ నియోజకవర్గంలోని బేగంబజార్ లో ఏర్పాటు చేసిన మెంబర్ షిప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed