- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
KTR: కేంద్ర మంత్రిని ఆప్యాయంగా హగ్ చేసుకున్న కేటీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
దిశ, వెబ్డెస్క్: సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ (BRS), టీడీపీ (TRP)ల మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. నిత్యం ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లో ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన సెమినార్కు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ (Kinjarapu Rammohan Naidu) నాయుడుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కూడా హాజరయ్యారు.
అయితే, సెమినార్లో ఓ ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడగా.. కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం రామ్మోహన్ నాయుడి (Rammohan Naidu)ని, కేటీఆర్ (KTR)) అప్యాయంగా హగ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.