క్రైమ్ రికార్డ్ బ్యూరో డీఎస్పీపై సస్పెన్షన్ వేటు..?

by Naveena |
క్రైమ్ రికార్డ్ బ్యూరో డీఎస్పీపై సస్పెన్షన్ వేటు..?
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా క్రైం రికార్డ్ బ్రాంచ్ బ్యూరో డీఎస్పీపై సస్పెన్షన్ వేటు పడినట్టుగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో డీఎస్పీగా పని చేసిన ఆయన తమ తనిఖీల్లో కిలో బంగారం దొరికిందని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని ఓ వ్యక్తిని నమ్మించి.. అతని వద్ద 20 లక్షలు తీసుకున్నట్టుగా సమాచారం. రోజులు గడుస్తున్నా కొద్దీ బంగారం ఇవ్వక, డబ్బులు ఇవ్వకపోగా రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్న డీఎస్పీ మధన్ లాల్ పై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా సదరు డీఎస్పీ మదన్ లాల్ ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టుగా తెలిసింది. మంగళవారం సదరు డీఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే డిఎస్పీపై బదిలీ వేటుకు సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Advertisement

Next Story

Most Viewed