అక్రమ సంబంధం పెట్టుకున్నారని వ్యక్తి హత్య

by Nagam Mallesh |
అక్రమ సంబంధం పెట్టుకున్నారని వ్యక్తి హత్య
X

దిశ, మిర్యాలగూడ : అక్రమ సంబంధం పెట్టుకున్నారని వ్యక్తిని హత్య చేసిన సంఘటన మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బనావత్ జాను(40) గత కొంతకాలంగా మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ నందు బిక్షం ఎత్తుకొని జీవిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సదరు మహిళ కూతురు ధరావత్ నాగమణి, అల్లుడు నాగరాజు, కుమారుడు బనావత్ సతీష్ లు పథకం ప్రకారం మూడు రోజుల క్రితం బండ రాయితో కొట్టి హత్య చేశారు. కాగా మృతుని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు గమనించి మృతుడి తమ్ముడికి కృష్ణకు తెలియజేశారు. దీంతో ఇంటికి వచ్చి చూడగా మృతదేహం కుళ్లిపోయి ఉంది. గ్రామస్తుల సూచన మేరకు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ మృతదేహం వద్ద రక్తపు మరకలు ఉండడంతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కుటుంబ సభ్యులపై అనుమానంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరం ఒప్పుకున్నట్టు రూరల్ ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed