ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. పవన్ కల్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. పవన్ కల్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లడ్డూ(Tirupati laddu) వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. గత వైసీపీ(YCP) సర్కారు హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా.. నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు వాడినట్లు రిపోర్టులో బయటపడింది. అంతేకాదు.. చేప నూనె, బీఫ్ కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది.

ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణీత(Praneetha) స్పందించారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించడం వెంకటేశ్వర స్వామి భక్తులు ఊహించలేని అంశమని ఆవేదన చెందారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు లడ్డూ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అటు ఇదే వ్యవహారంపై అధికార పార్టీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాగా, పవన్ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది చిత్రంలో ప్రణీత నటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed