చెరువుల శిఖం కబ్జా..యథేచ్చగా నిర్మాణాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-04 15:56:39.0  )
చెరువుల శిఖం కబ్జా..యథేచ్చగా నిర్మాణాలు
X

దిశ,నల్లగొండ బ్యూరో:నల్గొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న భీమ సముద్రం ( చర్లపల్లి చెరువులో) అక్రమ నిర్మాణాలు తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఆక్రమణలు చూస్తే అధికారులు అందరికీ తెలిసి కూడా ఈ భవనాల నిర్మాణ సమయంలో కబ్జాదారులు ఇచ్చే మడుపులకు ఆశపడి నియంత్రించ లేకపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చెరువు విస్తీర్ణం 1100 ఎకరాలు ఉన్నప్పటికీ అందులో 675 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం భూమి, మరో 425 ఎకరాలు పట్టాఖికం భూమి.

ఆకాష్ కాలేజీ ఆక్రమణే..?

చెరువు భూమిలో 70 శాతం ఆకాష్ పాఠశాల, జూనియర్ కాలేజీ నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. చెరువు భూమిలో ఎఫ్‌టీఎల్ హద్దు తర్వాత 30 మీటర్ల వరకు బఫర్ జోన్ హద్దు దిమ్మెను సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడి వరకు పట్టా భూముల అయినప్పటికీ వ్యవసాయ మాత్రమే చేసుకోవాలి తప్ప కట్టడాలు నిర్మించొద్ధు. కానీ అక్కడున్న ఓ ప్రైవేటు పాఠశాల కాలేజీ హద్దులు నిర్మాణం చేసింది. అంతేకాకుండా కాలేజీ హాస్టల్ కోసం ఏర్పాటుచేసిన డైనింగ్ హాల్, వంటశాల కూడా పూర్తిగా చెరువు భూమిలోనే నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది. కాలేజీ భవనం, డైనింగ్ హాల్, విద్యార్థులకు క్రీడాస్థలం కోసం ఆక్రమించిన స్థలం చెరువులోనిదే. దాదాపు నాలుగు ఎకరాలకు పైగా భూమి పాఠశాల కళాశాల ఆక్రమణంలోనే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

డిఫెన్స్ అకాడమీ కూడా..

ఆకాష్ కళాశాలకు పక్కనే ఓ డిఫెన్స్ అకాడమీ భవన నిర్మాణం జరుగుతుంది. ఆ భవనం ముందు సుమారు ఎకరం పైగా భూమిని భవన యజమానులు ఆక్రమించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. చెరువు భూమిలోనే విద్యార్థుల శరీర దారుఢ్యం నిర్వహించే శిక్షణ మైదాన స్థలమంతా చెరువు భూమిలోనే ఇది. భవనం ముందు ఉన్న ఎఫ్‌టీఎల్ హద్దురాళ్లను తీసి మరోచోట నాటారని సమాచారం. అయినప్పటికీ హద్దు రాళ్లు అవతలికి భవన యజమాని ప్రహరి గోడ నిర్మించినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.

అధికారులకు తెలిసినప్పటికీ..

చెరువు భూమిలోనే భవనాల నిర్మాణం జరుగుతుందన్న విషయం ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ ఎక్కడ నియంత్రణ ప్రయత్నాలు జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులు మామూళ్లకు ఆశపడి అధికారులు అక్రమ కట్టడాలను చూసి చూడనట్లు వదిలేశారనే వినికిడి. అందుకే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలను కూచి వేసి ఆ స్థలాన్ని ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవడానికి హైడ్రా లాంటి చట్టం జిల్లా కేంద్రాలకు రావాలని ఒత్తిడి ప్రభుత్వం పై రోజురోజుకు పెరుగుతుంది.

చెరువు కబ్జాకు గురైతే చర్యలు..

నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చర్లపల్లి గ్రామానికి చెందినటువంటి చెరువుని బఫర్ జోన్, ఎఫ్టిఎల్ ల్యాండ్ ఆకాష్ స్కూల్ ఆక్రమించడం పై వారం రోజుల్లోగా పూర్తిగా విచారణ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి భూమిని సర్వేయర్లతో కొలుస్తాం. ప్రస్తుతం అందరూ తిరుమలగిరి సాగర్ లో పైలెట్ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. ఒకవేళ కబ్జాకు గురైతే మాత్రం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో ఎన్.రవి తెలిపారు.

.

Advertisement

Next Story

Most Viewed