మూడింతలు పరిహారం చెల్లించి ఖాళీ చేయించండి: మూసీ కూల్చివేతలపై ఎంపీ కొండా

by karthikeya |   ( Updated:2024-10-17 09:18:29.0  )
మూడింతలు పరిహారం చెల్లించి ఖాళీ చేయించండి: మూసీ కూల్చివేతలపై ఎంపీ కొండా
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ సుందరీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కూల్చివేతలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు (గురువారం) అత్తాపూర్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన మూసీ బాధితులతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు.

అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతూ.. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేయడం దారుణమని, ఈ కూల్చివేతలను బీజేపీ సహించదని వార్నింగ్ ఇచ్చారు. పేదల బాధను పట్టించుకోకుండా ప్రభుత్వం బలవంతంగా కూల్చివేతలకు పాల్పడితే లక్ష మందితో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇళ్లు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ మూడింతలు పరిహారం చెల్లించాకే ఇళ్లు ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story