బాలానగర్​ సీఐగా నర్సింహా రాజు బాధ్యతలు స్వీకరణ

by Kalyani |
బాలానగర్​ సీఐగా నర్సింహా రాజు బాధ్యతలు స్వీకరణ
X

దిశ, కూకట్​పల్లి: బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ నూతన సీఐగా టి. నర్సింహా రాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ సీఐ గా విధులు నిర్వహిస్తున్న నవీన్​ కుమార్​ను రాజేంద్రనగర్​ డిఐగా, పేట్​ బషీరాబాద్​ డిఐగా విధులు నిర్వహిస్తున్న టి. నరసింహ రాజును బాలానగర్​ సీఐగా బదిలీ చేస్తూ సైబరాబాద్​ కమిషనర్​ అవినాష్​ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నర్సింహా సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ… పోలీస్​ స్టేషన్​ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు నేర సంబంధిత సేవలను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.

Advertisement

Next Story