గంజాయి పెంపకం, విక్రయదారుడి అరెస్టు

by Kalyani |
గంజాయి పెంపకం, విక్రయదారుడి అరెస్టు
X

దిశ, తాండూర్ : తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తితో పాటు ఆ మొక్కలను ఎండు గంజాయిగా మార్చి విక్రయిస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని లింగదరి గూడెం గ్రామానికి చెందిన జయరాం తన ఇంటి సమీపంలోని పెరట్లో గంజాయి మొక్కలను పెంచి తాండూర్ ఐబి సుభద్ర కాలనీకి చెందిన జునైద్ ఖాన్ అనే వ్యక్తికి ఇవ్వగా అతను ఇతరులకు విక్రయిస్తున్నాడన్నారు. పక్కా సమాచారం మేరకు జయరాం పెరట్లో తనిఖీ చేసి రూ.7 వేలు విలువ చేసే గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా గంజాయి మొక్కలను పెంచిన, విక్రయించిన తమకు సమాచారం ఇస్తే వివరాలను గోప్యంగా ఉంచి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు.

Advertisement

Next Story