ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా..

by Kalyani |
ఈ నెల 27వ తేదీన జాబ్ మేళా..
X

దిశ, మెదక్ టౌన్: కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ సబ్జెక్టులతో పీజీ/డిగ్రీ/ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఈ నెల 27న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా కే .హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రఖ్యాత ఔషధ సంస్థల్లో అప్రెంటిస్ ట్రైనీలుగా ఎంపికకు అవకాశం ఉంటుందని, 28 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు క్రింది లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఈ నెల 27న ఒరిజినల్ సర్టిఫికెట్ లతో హాజరు కావాలని తెలియచేశారు. పూర్తి వివరాలకు 7382929698 సంప్రదించాలని అన్నారు.

Next Story

Most Viewed