హైదరాబాద్ లో రూ.6 కోట్ల ఆభరణాలు చోరీ.. కేసులో అనూహ్యమైన ట్విస్ట్

by Prasad Jukanti |   ( Updated:2024-10-11 06:38:02.0  )
హైదరాబాద్ లో రూ.6 కోట్ల ఆభరణాలు చోరీ.. కేసులో అనూహ్యమైన ట్విస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో భారీ చోరీ కలకలం రేపింది. బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణ జ్యువెలర్ షాప్ లో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన యాజమమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షాప్ లో ఉన్న ఆభరణాల వివరాలు సేకరించారు. ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో షాప్ మేనేజర్ సుకేతు షా కనిపించకపోవడంతో పాటు అతడి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ వస్తోంది. దీంతో యాజమాన్యం అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed