రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం : ఎమ్మెల్యే

by Kalyani |
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం : ఎమ్మెల్యే
X

దిశ, చారకొండ : తమ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. చారకొండ మండల కేంద్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్ అధ్యక్షతన మహాజన సభ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ… రైతు సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని,అందులో భాగంగా రైతులకు పంట పెట్టుబడి సహాయంగా రైతు భరోసా పథకం అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతుల అభిప్రాయ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆగస్టు 15 లోపే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణం మాఫీ చేయడం జరుగుతుందని,ఈ విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ సందర్భంగా భరోసా పథకం అమలు గురించి రైతులు తమ సలహాలు,సూచనలు ఎమ్మెల్యే కు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్, డైరెక్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి రఘునందన్ రావు, డివిజన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ భాగ్యమ్మ, పీఏసీఎస్ సీవో వెంకటయ్య, డైరెక్టర్లు జగన్ మోహన్,కొండల్,పాండు,రాజయ్య ,ఏఈవో లు వంశీ , రేణుక అచ్చంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండె వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాల్ రాం గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య, గణేష్,గోరటి శివ, భీముడు నాయక్,మహాదేవ్ , నర్సింహ్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed