బ్రేకింగ్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి

by Satheesh |
బ్రేకింగ్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మంగళవారం భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పరస్పర కాల్పుల్లో కొందరు మావోయిస్టులు, జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది. కొహకమెట్‌ పీఎస్‌ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు కొహకమెట్‌ అటవీ ప్రాంతంలో 1400 మంది భద్రతా దళాలు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే కూంబింగ్‌ నిర్వహిస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు చేసుకున్నారు. ఈ హోరాహోరీ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరి కొందరు పారిపోవడంతో భద్రతా దళాలు దండకార్యణంలో జల్లెడ పడుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed