- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
బ్రేకింగ్: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
![బ్రేకింగ్: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి బ్రేకింగ్: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి](https://www.dishadaily.com/h-upload/2023/09/05/256731-encounter.webp)
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మంగళవారం భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పరస్పర కాల్పుల్లో కొందరు మావోయిస్టులు, జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది. కొహకమెట్ పీఎస్ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు కొహకమెట్ అటవీ ప్రాంతంలో 1400 మంది భద్రతా దళాలు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే కూంబింగ్ నిర్వహిస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం కాల్పులు చేసుకున్నారు. ఈ హోరాహోరీ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరి కొందరు పారిపోవడంతో భద్రతా దళాలు దండకార్యణంలో జల్లెడ పడుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.