ప్రధాని పర్యటన వేళ అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ

by GSrikanth |
ప్రధాని పర్యటన వేళ అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్‌లో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మోడీ సభపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా గత రాత్రి పొద్దుపోయే వరకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఈ మేరకు వివాదాలు లేని కొన్ని నియోజక వర్గాలకు అభ్యర్థుల పేర్లని ఖరారు చేయగా ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి కిషన్ రెడ్డి తీసుకు వెళ్లినట్లు సమాచారం.

దీంతో పాటు ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రత్యేకంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున తెలంగాణపై మరింత దృష్టి పెట్టాలని ఈ మేరకు అగ్రనాయకత్వంతో మరిన్ని సభలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. నిర్మల్, కరీంనగర్‌లలో మోడీ చేత బహిరంగ సభలు నిర్వహించే విషయంలో తాజా భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇక రేపు ప్రధాని నిజామాబాద్ పర్యటనకు ముందు అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed