కాంగ్రెస్ తోనే ముస్లిం కమ్యూనిటీకి న్యాయం : కాంగ్రెస్ మైనార్టీ వింగ్ స్పోక్స్ పర్సన్ షబ్బీర్ అలీ

by M.Rajitha |
కాంగ్రెస్ తోనే ముస్లిం కమ్యూనిటీకి న్యాయం : కాంగ్రెస్ మైనార్టీ వింగ్ స్పోక్స్ పర్సన్ షబ్బీర్ అలీ
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ తోనే ముస్లిం కమ్యూనిటీకి న్యాయం జరుగుతుందని మైనార్టీ వింగ్ స్పోక్స్ పర్సన్ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 4 శాతం రిజర్వేషన్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. దీని వలన 20 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరిందన్నారు. జాబ్స్, ఎడ్యుకేషన్ లో ఎన్నో అవకాశాలు లభించాయన్నారు. యూపీఏ 1, యూపీఏ 2 నిర్ణయాలతో ఎంతో మంది పేదలకు లాభం జరిగిందన్నారు. రైతులు ఆర్ధికంగా బలోపేతం అయ్యారన్నారు. ఐటీ ఉద్యోగాలు పెరిగాయన్నారు. ఇప్పుడు పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ తోనే ముస్లిం వర్గాలు బలోపేతం అవుతాయన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకు ఆగస్టు 25న సెలబ్రేషన్స్ చేయనున్నట్లు వెల్లడించారు.



Next Story