MLA Thudi : రైతులు ఆందోళన చెందవద్దు

by Kalyani |
MLA Thudi : రైతులు ఆందోళన చెందవద్దు
X

దిశ,వనపర్తి : రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భరోసా కల్పించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాల సముద్రం పూర్తిగా నిండడంతో బ్యాక్ వాటర్ తమ పంట పొలాలను ముంచేస్తుందని పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ రైతులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సోమవారం మద్దిగట్ల గ్రామ రైతులతో కలిసి నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించారు. నీటి మునగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

గత సంవత్సరం నూతనంగా నిర్మించిన చెరువు కట్ట నిర్మాణంలో భాగంగా అలుగును పెంచడంతో తమ పొలాల్లోకి నీరు చేరిందని రైతులు వాపోయారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …చెరువు ఎఫ్ టి ఎల్ ను పరిశీలించి తగు చర్యలు చేపట్టి,రైతులకు సహకరించాలని నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed