ప్రజావాణిలో మహిళ ఫోన్, పర్సు చోరీ..

by Aamani |
ప్రజావాణిలో మహిళ ఫోన్, పర్సు చోరీ..
X

దిశ, జగిత్యాల టౌన్ : ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన ఓ మహిళ పర్సు, మొబైల్ ఫోన్ ను దొంగలు మాయం చేసిన ఘటన జగిత్యాల కలెక్టరేట్ లో చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన జలజ అనే మహిళ నగదు,మొబైల్ ఓ కవర్ లో వేసి డోర్ పక్కన పెట్టి లోపలికి వెళ్ళింది. దరఖాస్తు ఇచ్చి బయటకు వచ్చిన మహిళకు కవర్ కనిపించకపోవడంతో అక్కడే ఉన్న కొంతమందిని అడిగి చూసింది. చివరికి దొంగతనానికి గురైనట్లుగా గుర్తించి వాపోయింది. కవర్ లో పెట్టిన పర్సులో నగదు, సెల్ ఫోన్ దొంగలు ఎత్తుకెళ్లాలని అధికారులకు మొరపెట్టుకుంది. స్పందించిన కలెక్టరేట్ సిబ్బంది సి.సి కెమెరాల ద్వారా చూసి వెతికి పెట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed