ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో పోలీసులతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాగ్వాదం

by Mahesh |
ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో పోలీసులతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాగ్వాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ముందస్తుగానే సోమవారం అన్ని చర్యలు తీసుకున్న నిర్వాహకులు, పోలీసులు మంగళవారం తెల్లవారు జామునే అనుకున్న సమయానికి శోభాయాత్ర ప్రారంభించారు. ఇదిలా ఉంటే పోలీసుల తీరు నచ్చకపోవడంతో.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. మహాగణపతిని తీసుకెళ్తున్న వాహనానికి అడ్డం గా కూర్చున్న ఉత్సవ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వినాయకుడిని చూసేందుకు వచ్చిన కనీసం భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పించడం లేదని గణేష్ కమిటీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కమిటీ సభ్యులకు పోలీసులు నచ్చజెప్పడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది. దీంతో ఖైరతాబాద్ మహాగణపతిని వేగంగా కాకుండా నెమ్మదిగా సాగర తీరం పైపు వడివడిగా కదిలిస్తున్నారు. కాగా ఈ మహాగణపతిని చూసేందుకు ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్ సమీపానికి చేరుకోగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై భారీగా ప్రజలు చేరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed