కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Shiva |
కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్-1 అభ్యర్థులు జీవో 29కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే వారికి మద్దతుగా బీఆర్ఎస్ సుప్రీం కోర్టుకు వెళ్లిందని అన్నారు. హైకోర్టు తీర్పు రాజ్యాంగబద్దంగా వస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టులు ఉండవని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీ మేరకు ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గ్రూప్-4లో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, ఒక్క పోస్టుకు ముగ్గురు అభ్యర్థులు సర్టిఫికేషన్ వేరిఫికేషన్‌కు సెలెక్ట్ అయ్యారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏక్ పోలీస్ నినాదం ఇచ్చారని ఏమైందని ప్రశ్నించారు. కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు రోడ్డు ఎక్కుతున్నాయని, పోలీస్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డికి శ్రద్ద లేదని ఆరోపించారు. తమిళనాడు, కర్ణాటకలో అమలు చేస్తున్న ఏక్ పోలీస్ నినాదాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరారు. సస్పెండ్ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జీవో 29పై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు రోడ్డు ఎక్కారని, ఒకే కేసుపై రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐ‌ఆర్‌లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్ పోసి చంపుతానని మైనంపల్లి అంటే ఇంత వరకు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే అరికేపూడి గాంధీని తీసుకువచ్చి పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, రంగినేని అభిలాష్, తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed