- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
గల్ఫ్సెల్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ గల్ఫ్కార్మికులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నది. గల్ఫ్సెల్, ఎన్నారై పాలసీ పై తుది నిర్ణయం తీసుకోనున్నది. ఈ మేరకు గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయనున్నది. త్వరలోనే ఆయా జిల్లాల ఎమ్మెల్యేలతోనూ ప్రభుత్వం ఓ సమీక్షను నిర్వహించనున్నది. ఆదివారం టీపీసీసీ ఎన్నారై సెల్ ప్రతినిధి బృందం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో భేటీ అయింది. గల్ఫ్దేశాల్లో తెలంగాణ ప్రజలకు పడుతున్న కష్టాలను వివరించింది. మృతులను ఇళ్లకు చేర్చడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే అంశాలను వినతి పత్రం రూపంలో అందజేశారు.
త్వరలోనే గల్ఫ్ప్రాంతాలకు వెళ్లే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం ఓ రివ్యూ నిర్వహించనున్నదని, సెప్టెంబర్ 17 లోపే గల్ఫ్బాధితుల సంక్షేమం, పాలసీపై ప్రభుత్వ ప్రకటన ఉంటుందని వేం నరేందర్ రెడ్డి, ఎన్నారై సెల్ తో చెప్పినట్లు ఆయా ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జి పీ. వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, గల్ఫ్ జేఏసీ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.