Dr.Missing:స్నానానికి వెళ్లి డాక్టర్ గల్లంతు

by Sridhar Babu |   ( Updated:2024-10-27 14:01:53.0  )
Dr.Missing:స్నానానికి వెళ్లి డాక్టర్ గల్లంతు
X

దిశ, మెట్ పల్లి : మెట్ పల్లి (Met Palli)మండలం విట్టంపెట్ (Vittampet)గ్రామ శివారులో ఎస్సారెస్పీ వరద కాలువలో సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు వైద్యులలో ఒకరు గల్లంతయ్యారు. డీఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మెట్లచిట్టాపూర్ గ్రామానికి సరదాగా వచ్చిన వైద్యులు తిరిగి విట్టంపెట్ గ్రామ శివారులో గల వరద కాలువ (Flood canal)మీదుగా తిరిగి వెళ్తుండగా ఎస్సారెస్పీ కాలువలో ప్రశాంత్, ఉదయ్ కుమార్ అనే వైద్యులు సరదాగా స్నానానికి వెళ్లారు.

ఒక్కసారిగా వరద నీరు ఎక్కువ కావటంతో ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఊపిరి ఆడక నీటిలో గల్లంతు కావడంతో వెంటనే ప్రశాంత్ అక్కడ ఉన్న వారికి సమాచారం అందించారు. గల్లంతైన వైద్యుడు ఉదయ్ స్వస్థలం హన్మకొండ కాగా మెట్ పల్లి పట్టణంలోని యశోద ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడని, గల్లంతైన వ్యక్తి కోసం సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై చిరంజీవి సిబ్బందితో గాలింపు చర్యలు చేపడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఫైర్ స్టేషన్ సిబ్బందికి కూడా సమాచారం అందించామని, రాత్రి వరకు గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.

Advertisement

Next Story