కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: మంత్రి సీతక్క

by Mahesh |
కంపెనీలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: మంత్రి సీతక్క
X

దిశ; తెలంగాణ బ్యూరో: కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు తమ సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తించాలని మంత్రి సీతక్క(Minister Sitakka) పేర్కొన్నారు. ఆదివారం ఆమె ప్రజా భవన్(Praja Bhavan)లో పలు కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కంపెనీలు తమ వంతు చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత(adoption) తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్, ములుగు వంటి అటవీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని సూచించారు.

కంపెనీలు పే బ్యాక్ టు సొసైటీ (Payback to society) అనే నినాదంతో తమ సామాజిక బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు. ఒక లక్ష్యంతో సీ‌ఎస్‌ఆర్ నిధులను వెచ్చిస్తే మార్పు తద్యమన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న అవకాశాలను, వనరులను, అవసరాలను కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు తెలియ చెప్పేందుకు వారితో కలిసి త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తో పాటు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్, సెర్ఫ్​ సీఈఓ దివ్య దేవరాజన్, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు దివాకర్ టీఎస్, రాజర్షి షా, పలు కంపెనీలు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed