రోడ్డుపై నోట్లు..ఎగబడి తీసుకున్న జనం..ఆ తర్వాత ఏం జరిగిందంటే..

by Naveena |
రోడ్డుపై నోట్లు..ఎగబడి తీసుకున్న జనం..ఆ తర్వాత ఏం జరిగిందంటే..
X

దిశ, వేల్పూర్: మండలం అంక్సాపూర్ జాతీయ రహదారి(63)పై నకిలీ నోట్లు కలకలం రేపింది. రహదారిపై కనపడ్డ నకిలీ 100,500 నోట్లను రహదారిపై వెళ్తున్న వాహనదారులు ఎగబడి తీసుకున్నారు. తీరా నోట్లపై ముద్రను చూసేసరికి..నకిలీ నోట్లుగా గుర్తించారు. నోట్లపై స్కూల్ పిల్లల ప్రాజెక్టు వర్క్ కోసం మాత్రమే అని ప్రింట్ చేసిన ముద్ర ఉండడంతో.. జనం కంగుతిన్నారు.బహుశా ఇది స్కూల్ పిల్లల పనే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రతిరోజు స్కూల్ బస్ లో పిల్లలు ఆర్మూర్ వెళ్తుంటారు. దీంతో విద్యార్థులు ఈ జాతీయ రహదారిపై బస్ లో నుంచి రోడ్డుపై పడేసారని అనుకొంటున్నారు.

Advertisement

Next Story