ఏదో ఐదేళ్లు గడిపేయడానికి రాలే.. అదే మా అసలు టార్గెట్: డిప్యూటీ CM భట్టి హాట్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-07-27 14:19:34.0  )
ఏదో ఐదేళ్లు గడిపేయడానికి రాలే.. అదే మా అసలు టార్గెట్:   డిప్యూటీ CM భట్టి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాబోయే 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ అనంతరం భట్టి రిప్లై ఇస్తూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ఈ ఏడాది నుండే ఇస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే స్పష్టమైన విద్యుత్ పాలసీ తీసురాబోతున్నామని, 2035 వరకు విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఏదో ఐదేళ్లు గడిపేయడానికి మేం అధికారంలోకి రాలేదని.. తమ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉన్నదని చెప్పారు.

దేశం గర్వించేలా తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను తీసుకువస్తామని.. 20 నుండి 25 ఎకరాల ప్రాంగణంలో విశాలంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మిస్తామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థుల తయారవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ నూతన విద్యా విధానం దేశానికి ఆదర్శం కాబోతుందన్నారు. మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు.

మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామని, ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. గ్యారెంటీల అమలు కోసం ప్రతిక్షణం పరితపిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రివ్యూ జరగలేదని, కానీ తమ పాలనలో వరుస సమీక్షలతో పాలన పరుగులు పెడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. మార్చి 1 నుంచే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తున్నాం, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed