కాంగ్రెస్ నేత మధుయాష్కికి తృటిలో తప్పిన ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు

by Disha Web Desk 1 |
కాంగ్రెస్ నేత మధుయాష్కికి తృటిలో తప్పిన ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఆలేరు సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆయన ట్విట్టర్ వేదిక పోస్ట్ షేర్ చేశారు తెలిపారు. డ్రైవర్ ముఖేష్ అప్రమత్తత వల్లే తనకు పెను ప్రమాదం తప్పిందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మధు‌యాష్కీ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Next Story