CM రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద లేఖ..

by Rajesh |
CM రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద లేఖ..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం కేసీఆర్ మాదక ద్రవ్యాల నిరోధకంపై ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం పాన్ షాపులలో, కిరాణ షాపులలో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతోందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా ఇంజినీరింగ్, ఫార్మా, మెడికల్, జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలు ఉన్నందున డ్రగ్స్ సప్లయర్స్ కళాశాల విద్యార్థులే లక్ష్యంగా సమీపంలో గుడిసెల్లో గంజాయిని విక్రయిస్తున్నారని లేఖలో తెలిపారు. దీంతో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దనిద్ర వీడి డ్రగ్స్ సప్లై, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed