- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Shivam Dube : హరారే గ్రౌండ్ సిబ్బంది కోసమే ఆ పని చేశా : శివమ్ దూబె
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల జింబాబ్వేలో పర్యటించిన టీమ్ ఇండియా టీ20 సిరీస్ను 4-1తో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆఖరిదైనా ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ సిరీస్ను ఘనంగా ముగించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం దూబె తన మంచి మనసును చాటుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డబ్బును హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియం సిబ్బందికి ఇచ్చేశాడు. తాజాగా దూబె అలా చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
‘జింబాబ్వేలోని గ్రౌండ్ స్టాఫ్ అసాధారణ పని చేశారు. మేము ఆడేందుకు అద్భుతమైన ఆట పరిస్థితులను కల్పించారు. వారి పనికి, అంకిత భావానికి గుర్తింపు ఉండదు. అందుకే, వారికి కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డబ్బును ఇచ్చా. గ్రౌండ్ సిబ్బంది శ్రమను గుర్తించడం, వారికి విలువ ఇవ్వడం అవసరమని నమ్ముతా.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఆఖరి మ్యాచ్లో దూబె ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. మొదట బ్యాటుతో 12 బంతుల్లో 26 పరుగులు చేసిన అతను 2 వికెట్లు కూడా పడగొట్టాడు.