గ్రేట్ బ్రిటన్ చేతిలో భారత్ ఓటమి

by Harish |
గ్రేట్ బ్రిటన్ చేతిలో భారత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా యూరోప్ పర్యటనలో వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన భారత పురుషుల హాకీ జట్టు దూకుడుకు బ్రేక్ పడింది. ఆదివారం గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-1 తేడాతో పరాజయం పాలైంది. భారత్ ఏకైక గోల్‌కే పరిమితమైంది. అభిషేక్ 35వ నిమిషంలో చేసిన గోలే తొలి, చివరిది. బ్రిటన్ తరపున బందూరక్ నికోలస్ రెండో గోల్స్‌, కాల్నాన్ విల్ ఒక గోల్ చేశాడు.

మరోవైపు, ఈ టూరులో మహిళల హాకీ జట్టు ఓటమిపరంపర కొనసాగుతోంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ చేతిలో 3-2 తేడాతో ఓడిపోయింది. భారత్ తరపున నవ్‌నీత్ కౌర్, షర్మిల దేవి చెరో గోల్ చేశారు. చివరి క్వార్టర్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలువగా.. 57వ నిమిషంలో పీటర్ ఇసాబెల్లె చేసిన గోల్‌తో బ్రిటన్ విజయం సాధించింది. వాట్సన్ షార్లెట్ ఆ జట్టు తరపున రెండు గోల్స్‌తో కీలక పాత్ర పోషించింది. భారత మహిళల జట్టుకు వరుసగా ఇది 6వ పరాజయం. ఈ నెల 8న భారత పురుషుల, మహిళల హాకీ జట్లు జర్మనీ జట్లతో తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed