IND vs AUS 3rd ODI: 'షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమిండియాలో 13 మందే'

by Vinod kumar |
IND vs AUS 3rd ODI: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమిండియాలో 13 మందే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం సెప్టెంబరు 27న రాజ్‌కోట్‌లో చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టులో 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉంటారని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మొదటి రెండు వన్డేల్లో ఆడిన శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చామని.. శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ షమి వ్యక్తిగత కారణాలతో తమ ఇళ్లకు వెళ్లారని రోహిత్ తెలిపారు. మూడో వన్డేకు అందుబాటులో ఉండాల్సిన హార్దిక్ పాండ్య కూడా వ్యక్తిగత కారణాలతో ఇంకా ఇంటి వద్దే ఉన్నట్లు చెప్పాడు.

ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. మొదటి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రోహిత్, కోహ్లీ, కుల్‌దీప్‌ యాదవ్‌ తిరిగి జట్టుతో కలిశారు. రెండో వన్డేలో ఆడని బుమ్రా కూడా రాజ్‌కోట్‌లో టీమ్‌తో చేరాడు.

మూడో వన్డేకు అందుబాటులో ఉన్న 13 మంది ఆటగాళ్లు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అశ్విన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ముఖేశ్‌ కుమార్.

Advertisement

Next Story