- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వరల్డ్ కప్ ఆడనప్పుడు నేనెందుకు ఆలోచించాలి : రియాన్ పరాగ్ కీలక వ్యాఖ్యలు
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్కు ఎంపిక చేసిన భారత జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్, అసోంకు చెందిన రియాన్ పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు టీ20 వరల్డ్ కప్ చూడాలనే ఇంట్రెస్ట్ లేదని వ్యా్ఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రియాన్ పరాగ్కు టీ20 ప్రపంచకప్లో టాప్-4 జట్లు గురించి ప్రశ్నించగా.. తాను వరల్డ్ కప్ ఆడనప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చాడు.
‘టాప్-4 జట్లపై ఇప్పుడే మాట్లాడితే పక్షపాతం చూపించినట్టు అవుతుంది. నిజాయతీగా చెప్పాలంటే అసలు నాకు ప్రపంచకప్ను చూడాలనే లేదు. ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోషపడతా. నేను వరల్డ్ కప్ ఆడుంటే, టాప్-4 జట్లతోపాటు అన్నింటి గురించి ఆలోచించేవాడిని.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్-17లో రాజస్థాన్ తరపున రియాన్ పరాగ్ సత్తాచాటాడు. 14 ఇన్నింగ్స్ల్లో 573 పరుగులు చేసి టాప్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులో అతనికి చోటు దక్కతుందని వార్తలు వచ్చినా.. సెలెక్టర్లు అతన్ని పక్కనపెట్టారు.