మూడోసారి ముచ్చటగా మునిగిన పల్లె ప్రకృతి వనం.. ఎక్కడంటే ?

by Shyam |   ( Updated:2021-08-30 04:21:41.0  )
మూడోసారి ముచ్చటగా మునిగిన పల్లె ప్రకృతి వనం.. ఎక్కడంటే ?
X

దిశ, పాలకుర్తి : ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పాలకుర్తి మండలం వాల్మీడి గ్రామంలో ముచ్చటగా మూడోసారి మునిగిపోయింది. సోమవారం రాత్రి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం జలమయంగా మారింది. ఈ భారీ వర్షానికి వాల్మీడి గ్రామ చెరువు మత్తడి పోయడంతో పల్లె ప్రకృతి వనం పూర్తిగా మునిగిపోయింది. దేవరుప్పుల మండలంలో‌ని చెక్ డ్యాంలు మరోసారి పొంగిపొర్లుతున్నాయి. లక్ష్మి నారాయణ పురం చెరువు మత్తడి పోయడం తో హెచ్ పీ, భారత్ పెట్రోల్ స్టేషన్లు నీటి‌తో నిండిపోయాయి. పలు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఉన్నత శ్రేణీ ఆసుపత్రి ప్రాంగణాలు వర్షపు నీటిలో ఉన్నాయి. రాజీవ్ చౌరస్తా జనగామ రోడ్డు వైపు నీళ్లు నిలిచాయి.అనేక పంట పొలాలునీటితో చెరువులను తలపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed