ఘోరం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యభర్తల ఘాతుకం.. క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించే రియల్ స్టోరీ..

by Kavitha |
ఘోరం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యభర్తల ఘాతుకం.. క్రైమ్ థ్రిల్లర్‌ని తలపించే రియల్ స్టోరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య, భర్తలు ఇద్దరు కలిసి ఏకంగా ఒక మనిషినే హత్య చేశారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలను అధిగమించేందుకు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ బిజినెస్ మ్యాన్ సేమ్ అతనిలాగే ఉన్న వ్యక్తిని హత్య చేసి, దానిని ప్రమాదంగా చిత్రీకరించి, చివరకు జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని హసన్ జిల్లాలోని అరసికేరే తాలుకాలోని గండాసి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన ప్రకారం.. హోస్‌కోట్‌లో టైర్ల దుకాణం ఉన్న మునిస్వామిగౌడ్‌కు భారీగా అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చేందుకు కోట్లలో ఇన్సూరెన్స్ సొమ్మును క్లెయిమ్ చేసేందుకు పథకం వేశాడు. అందుకోసం తనలాగే ఉండే వ్యక్తిని గుర్తించి అతడితో భార్యభర్తలిద్దరూ స్నేహం చేశారు. ఇక అతన్ని చంపేద్దామని ఓ లారీ డ్రైవర్‌తో బేరం కూడా కుదుర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం, ఆగస్టు 12న మునిస్వామి, తనలాగే ఉన్న వ్యక్తితో కలిసి సిడ్లఘట్ట సందర్శించేందుకు వెళ్లాడు. అదే సమయంలో కారు టైర్ పంక్చర్ అయినట్లు మునిస్వామి కారుని రోడ్డు పక్కన ఆపేసి, లారీ డ్రైవర్‌కి సైగ చేశాడు. లారీ దగ్గరకు రాగానే బాధితుడి గొంతుకి తాడు బిగించి, లారీ కింద పడేలా చేసి హత్య చేశాడు. దీంతో అక్కడికక్కడే బాధితుడు మరణించాడు. అయితే, బాధితుడి మెడపై గాయాలకు సంబంధించిన గుర్తులు ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మునిస్వామి భార్యని విచారించిన సమయంలో తన భర్త చనిపోయినట్లు నటించింది. అతడిని చంపేసి ప్రమాదంగా చిత్రీకరించి ప్లాన్ చేసినట్లు ఎస్పీ మహ్మద్ సుజీత చెప్పారు.

ఇదిలా ఉంటే, చనిపోయిన వ్యక్తిగా నటిస్తున్న మునిస్వామి వారం లోపే ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరుకావడం, దీనిని అతని బంధువైన సిడ్లఘట్ట పోలీస్ ఎస్ఐ చూడటంతో అతడి ప్లాన్ మొత్తం తెలిసింది. దీనిపై ప్రశ్నించగా, తానే ఈ హత్య చేసినట్లు వెల్లడించారు. గండాసి పోలీసులకు విషయం చెప్పి, అరెస్ట్ చేయించాడు. అయితే అతని భార్య శిల్పా రాణి పారిపోయినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మరణించిన వ్యక్తి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.

Next Story

Most Viewed