- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
CM Relief Fund : వరద బాధితులకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ భారీ విరాళం
దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో వరద బాధితులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రముఖులు, దిగ్గజ సంస్థలు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, నేతలు, ప్రజలు భారీ సీఎం రిలీఫ్ ఫండ్కు నిధులు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రఖ్యాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం అందించింది.
రెడ్డీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.నారాయణ రెడ్డి సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రెడ్డీస్ వారిని ముఖ్యమంత్రి గారు అభినందించారు. ఈ సందర్భంలో సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తదితరులు ఉన్నారు.