అమరవీరులకు అమిత్ షా నివాళి

by karthikeya |   ( Updated:2024-10-21 06:33:26.0  )
అమరవీరులకు అమిత్ షా నివాళి
X

దిశ, వెబ్‌డెస్క్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులందరికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ రోజు (సోమవారం) ఢిల్లీలోని పోలీస్ మెమొరియల్‌ వద్ద ఆయన పూల మాల ఉంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పోలీసులు, భద్రతా దళాలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారందరి బలిదానం వల్లే దేశం ఇప్పటికీ సురక్షితంగా ఉందని అన్నారు. దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలకు తెగించి పోరాడి అమరవీరులైన పోలీసుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. కాగా.. అమిత్ షాతోపాటు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్, ఇతరులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Next Story

Most Viewed