Guwahati : పంద్రాగస్టు రోజున ఐఈడీ అమర్చిన నిందితుడి అరెస్ట్

by Hajipasha |
Guwahati : పంద్రాగస్టు రోజున ఐఈడీ అమర్చిన నిందితుడి అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవం రోజున (ఆగస్టు 15న) అసోంలోని గువహటిలో ఉన్న గాంధీ మండప్ వద్ద ఐఈడీని అమర్చిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడిని గుర్తించారు. హోజాయ్ జిల్లాలోని కకీ ఏరియాకు చెందిన మనాబ్ కాలితా అనే వ్యక్తే ఈ ఐఈడీని అమర్చాడని దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని జోర్హట్ నగర పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం నిందితుడు మనాబ్ కాలితాను గువహటి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed