Nagarjuna: ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నాగార్జున ఎమోషనల్ ట్వీట్

by Hamsa |   ( Updated:2024-10-06 12:26:04.0  )
Nagarjuna: ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నాగార్జున ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబోలో వచ్చిన ‘శివ’ మూవీ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 1990లో విడుదలైన ఈ మూవీ భారీ విజయం సాధించింది. అంతేకాకుండా హీరోగా నాగార్జునకు, డైరెక్టర్‌గా ఆర్జీవీకి ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, శివ సినిమా రిలీజ్ అయి 35 ఏళ్లు పూర్తి కావడంతో నాగార్జున ఈ విషయాన్ని తెలుపుతూ ‘X’ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘శివ విడుదలై 35 ఏళ్లు అవుతోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మా నాన్న కలిసి కారులో ప్రయాణించిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను.

అయితే ‘‘నిన్న రాత్రి నేను ‘శివ’ మూవీ చూశాను. మార్నింగ్ ఇదొక బిగ్ హిట్ అని విన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదొక బిగ్గెస్ట్ హిట్ మూవీ అవుతుందని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన నాతో అన్నారు. ఆ మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్లు అయినా మా సినిమాపై అభిమానం కనబరుస్తున్న సినీ ప్రియులకు, శివ రూపొందించడంలో భాగమైన వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు. ఇక దీనిపై ఆర్జీవీ రియాక్ట్ అవుతూ.. ‘‘లైఫ్ టైమ్ గుర్తుండిపోయే బ్రేక్ ఇచ్చినందుకు థాంక్స్. మీ అమితమైన నమ్మకం, సపోర్ట్ లేకపోతే ‘శివ’ నేను ఉండేవాళ్లం కాదు’’ అని రిప్లై ఇచ్చారు. ప్రజెంట్ వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read More..

వావ్.. ‘దేవర’ సాంగ్‌కు అదిరిపోయే డ్యాన్స్ చేసిన కింగ్ నాగార్జున.. వీడియో వైరల్

Advertisement

Next Story