‘రాజాసాబ్‌’లో ప్రభాస్‌ను కొత్తగా చూడబోతున్నారు.. హైప్ పెంచుతున్న మాళవిక కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-04 15:08:09.0  )
‘రాజాసాబ్‌’లో ప్రభాస్‌ను కొత్తగా చూడబోతున్నారు.. హైప్ పెంచుతున్న మాళవిక కామెంట్స్
X

దిశ, సినిమా:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ కల్కి తర్వాత ప్రజెంట్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమాను మారుతి తెరకెక్కిస్తుండగా.. ఇందులో మాళవిక మోహనన్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబట్ల నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, రిద్ది కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే షూటింగ్ పూర్తయ్యే దశలో ఉన్న రాజా సాబ్ 2025 ఏప్రిల్ 10న విడుదల కాబోతున్నట్లు సమాచారం.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక.. రాజాసాబ్‌లోని ప్రభాస్ లుక్ గురించి పలు విషయాలు వెల్లడించింది. ‘‘ఈ మూవీ రొమాంటిక్ కామెడీ జోనర్‌లో రాబోతున్న హార్రర్ సినిమా. ప్రభాస్‌తో నటించడం ఎక్జయిటింగ్‌గా ఉంది. చాలా ఫన్నీ అండ్ జోవీయల్‌గా సాగే పాత్రలో కనిపింబోతున్నారు. ఈ సారి ఆయనను ప్రేక్షకులు సరికొత్త లుక్‌లో చూడబోతున్నారు. చాలా వరకు మేము షూటింగ్ పూర్తి చేశాము ఇంకా కొంచెం మాత్రమే ఉంది. చాలా ఏళ్ల తర్వాత అతను డిఫ్రెంట్ క్యారెక్టర్‌లో నటించబోతున్నారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ అమ్మడు కామెంట్స్ మూవీపై హైప్ పెంచుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు రాజా సాబ్ విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More....

Tollywood: టాలీవుడ్‌ వైజాగ్‌కు షిఫ్ట్‌ అవుతుందా.. దీనిలో నిజమెంత?


Advertisement

Next Story

Most Viewed